మహిళల రక్షణ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారి పోయింది.. వారి రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాల ను , కొత్త చర్యలను అమలు చేస్తున్న కూడా ప్రజలకు రక్షణ పై నమ్మకం లేకుండా పోయింది.. ఏదోక రకంగా కామాంధులు దారుణం గా లైంగిక దాడి చేసి వారిని చంపేస్తున్నారు.. ఇక తక్కువ కులలా వారి పరిస్థితి మరి దయ నీయంగా మారింది.. అసలు విషయానికొస్తే.. అభంశుభం తెలియని గిరిజన బాలిక పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయం చూసి చెరబట్టాడు. తన పశువాంఛ తీర్చుకుని పారి పోయాడు. 

 

 


ఆ అభాగ్యురాలి కి తల్లీ , తండ్రి లేక పోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడిపోయింది. చివరికి విషయం బంధువులకు తెలిసి పోలీసులను ఆశ్రయించడం తో విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఈ అమానుష ఘటన విశాఖపట్నం జిల్లా లో చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం లోని జి.మాడుగు మండలం కె.కోడాపల్లి పంచాయతీ జన్నేరు గ్రామానికి చెందిన గిరిజన మైనర్ బాలిక(15) పై బందవీధి గ్రామానికి చెందిన గొర్లె కుమార్ కన్నేశాడు. అదనుచూసి బాలికను ఎత్తు కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అమానుషంగా రేప్ చేసి తన కామ కోరిక తీర్చుకున్నాడు. 

 

 


తన పై జరిగిన లైంగిక దాడి వల్ల భయ పడిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసి అరవడం మొదలు పెట్టింది. కన్నవాళ్లు కూడా లేని ఆ దీనురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుంగి పోయింది. ఎలాగో విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.అలాగే బాలికను రేప్ చేసిన స్థలాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: