ఆ చిన్నారికి ఎనిమిదేళ్ల వయసు పాఠశాల ఇల్లు తన స్నేహితులు తప్ప మరో ప్రపంచం లేదు.. ఇక ప్రతిరోజూ తల్లిదండ్రులు చెప్పినట్లుగానే పాఠశాలకు వెళ్లడం పాఠశాల ముగియగానే ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి ఆడుకుంటే సంతోషంగా గడపడం ఇదే ఆ చిన్నారి ప్రపంచం.. ఇక రోజు మాదిరిగానే ఇటీవలే ఓ రోజు పాఠశాలకు వెళ్ళింది. కానీ గుడి లాంటి పాఠశాలలో కలలో కూడా ఊహించని దారుణం జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు ఎవ్వరు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాలిక ఏడుస్తూ వచ్చి జరిగిన దారుణాన్ని టీచర్ తో చెప్పింది.. దీంతో టీచర్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది.


 దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ పరిధిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతుంది. ఆరు రోజుల క్రితమే పాఠశాలలో అడ్మిషన్ తీసుకుంది.  రోజు పాఠశాలకు వెళ్లడం ఇంటికి వచ్చి స్నేహితులతో ఆడుకోవడం చేసేది. అయితే ఇటీవల స్కూల్ వెళ్లిన బాలిక మధ్యాహ్న సమయంలో బాత్రూం కి వెళ్ళింది  అక్కడే లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి బాలికను గమనించాడు.. ఈ క్రమంలోనే బాలిక ఒంటరిగా ఉందని గమనించి ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఏడుస్తూ వచ్చిన బాలిక టీచర్ కి జరిగిన విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనతో ఇక మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం భయాందోళనలో మునిగి పోయారు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎంతో మంది కామాంధులు రెచ్చిపోయి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతూ ఉన్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పాలి. కామాంధులను శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: