కర్ణాటకలో అయిదు ఉచిత పథకాల హామీ కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో దేశ వ్యాప్తంగా దాన్ని మరింత కొనసాగించాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచితాల హామీని కొనసాగించాలనే ఆశయంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోని మీడియా వింత వైఖరి అంతు పట్టకుండా ఉంది.


జగన్ అమ్మఒడి, విద్యాదీవెన, ఫీజు రియింబర్స్ మెంట్స్ ఇస్తుంటే ఆంధ్రను అప్పులపాలు చేస్తున్నారు. మరో శ్రీలంకల తయారు అవుతుందని టీడీపీ అనుకూల మీడియా తెగ వార్తలు రాసేసింది. ఇప్పటికీ అలాంటి నెగిటివ్ ప్రచారాన్ని సీఎం జగన్ పై కొనసాగిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు సంబంధించిన యూపీఏ ప్రస్తుతం ఈ సమావేశాల్లో ఇండియా పేరు మార్చుకున్నారు. ఈ ప్రతిపక్షాల కూటమికి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశంలో ఉచిత పథకాలను అమలు చేద్దామని ప్లాన్ వేశారట. దీన్ని ప్రతిపక్షాల కూటమి సమావేశంలో ఆయన చర్చించినట్లు కూడా తెలుస్తోంది.


ఒక రాష్ట్రంలోనే ఉచితాలు ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రం ఆర్థికంగా కుంటు పడిపోతుందని, పని చేయకుండా సోమరిపోతులుగా మారిపోతారని అని తెగ ప్రచారం చేసేసే ఎల్లో మీడియా ఇప్పుడు ఉచితాలు ఇచ్చేద్దాం అని భారీ హెడ్డింగ్ లతో మరి వార్తలు రాస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉచితాలు తప్పు లేదు. కానీ ఆంధ్రలో సీఎం జగన్ ఇస్తే అదేదో నేరం చేసినట్లుగా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తుంటారు.


ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెర వెనక ప్రయత్నాలు చేస్తున్న సంస్థల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎల్లో మీడియా కూడా తయారైనట్లు తెలుస్తోంది. మరి ఇక్కడ బీజేపీ,టీడీపీ కలవాలని కోరుకుంటునే ఒకప్పుడు హస్తం పార్టీ అంటేనే అంతెత్తున లేచేది ఎల్లో మీడియా. ఇప్పుడు అటు వైపు చూడడానికి కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: