దాదాపు రూ.11 వేల కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని మోదీని కలడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పై విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్ అని పిలవకుండా భాగ్యలక్ష్మీ నగరం అని పలకడంతో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. అమిత్ షా వచ్చిన సమయంలో కూడా భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. బండి సంజయ్ కూడా చార్మినార్ ప్రాంతంలోనే బహిరంగ సభ కూడా పెట్టారు.
హైదరాబాద్ అనగానే గతంలో చార్మినార్ ప్రసిద్ధిగా చూపించే వారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ అంటే అదే చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం ప్రసిద్దమైందని బీజేపీ గతం నుంచే చేస్తున్న ప్రచారం. దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని బీఆర్ఎస్,ఎంఐఎం నాయకులు గతంలో నే విమర్శలకు దిగారు. గతంలో రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే భాగ్యలక్ష్మీ టెంపుల్ గురించి మాట్లాడే వారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం గురించి మాట్లాడిన వారిలో చేరిపోయారు.