
అసలు భూమిపై జీవకోటి మనుగడకు అసలైన కారణం దానికి అనుకూలమైన వాతావరణం ఉండడమే. కానీ ఇక్కడ వాతావరణం విషతుల్యమైతే ఇదే భూగోళం పైన మనుగడ సాగించడం అసాధ్యమైపోతుందని వాళ్ళు అంటున్నారు. అంతరిక్షంలో సుదూర తీరంలో ఉన్న సూపర్ నోవాల నుండి భూగోళానికి ముప్పు తప్పదని, దాన్ని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదని అమెరికాకి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇదిలా ఎందుకు సంభవిస్తుంది అంటే అంతరిక్షంలో ఉన్న అనేక నక్షత్రాలన్నీ కలిసి సూపర్ నోవాల మారి పేలిపోయి లాస్ట్ పెయిర్ అనేది ఏర్పడుతుంది, దీనివల్ల అత్యంత ప్రమాదమైన ఎక్స్ కిరణాలు వెలువడి దగ్గర్లో ఉన్న గ్రహాలను చేరుతాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. దాని నుండి వెలువడే అల్ట్రా వైలెట్ రేస్ నుండి భూమిని కాపాడడానికి మనకు మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ ఎక్స్ కిరణాలు ఈ ఓజోన్ పొరని విచ్ఛిన్నం చేస్తాయట. దాంతో యూవి కిరణాల రేడియేషన్ డైరెక్ట్ గా భూమి పైకి చేరుతుంది. దానివల్ల నైట్రోజన్ డయాక్సైడ్ అని విషపూరితమైన వాయువు భూమి మీదకు వెలబడుతుంది. అది వెలువడినప్పుడు ఒక గోధుమ రంగు లేయర్ భూమి చుట్టూ ఏర్పడి జీవజాలాలు అంతరించిపోతాయని యూనివర్సిటీ ఆఫ్ బల్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారని తెలుస్తుంది.