భారత్ లో సెక్యూలరిస్టుల ముసుగులో ఉండే వారు దేశంలో ఎంతమందిని మతం మార్చుతున్న పట్టించుకోరు. కానీ కేరళ స్టోరీ లాంటి సినిమా వల్ల ఓ వర్గం మనోభావాలు దెబ్బతీస్తున్నారని పెద్ద రచ్చే చేస్తారు.  అక్కడ తప్పిపోయిన వారి సంఖ్య తప్పుగా చెబుతున్నారు. అంతా కాదు. తక్కువ ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. సంఖ్య విషయంలో గొడవ చేస్తున్నారు.  కానీ వారిని మతం మార్పించి విదేశాలకు పంపి ఉగ్రవాదులుగా మార్చిన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. మరి ఇదెక్కడి అరాకచమో అర్థం కానీ విషయం.


ఇదే సమయంలో గుజరాత్ లో అయిదేళ్లుగా దాదాపు 40 వేల అమ్మాయిలు తప్పిపోయారని వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై గుజరాత్ పోలీసులు  గట్టిగానే సమాధానమిచ్చారు. గుజరాత్ తప్పిపోయిన వారు కుటుంబ తగదాలు, పరీక్షల్లో ఫెయిల్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు. తదితర విషయాల్లో ఇబ్బందులు పడ్డ వారు మాత్రమే వెళ్లిపోయారని తెలిపారు. వీరిలో దాదాపు 39, వేల మంది కి పైగా తీసుకొచ్చామని చెప్పారు.


అనవసర ఆరోపణలు చేస్తున్న వారు. నివేదికను మొత్తం చదివితే నే తెలుస్తుందని చెబుతుననారు. ఈ నివేదికలో  ఎక్కడెక్కడ ఎవర్ని పట్టుకుని తిరిగి తీసుకొచ్చాం. ఎవరిపై కేసులు నమోదు చేశామనే వివరాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇండియాలో అది కేరళలో హిందూ మహిళల్ని మతం మార్పించి విదేశాలకు చేర్చి అక్కడ ఉగ్రవాద ట్రైనింగ్ ఇప్పించి మళ్లీ తిరిగి ఇండియాలోనే దాడులు చేసేలా చేస్తున్నారనేది సినిమా సారాంశం.


అయితే ఇది రియల్ స్టోరీ అని ఒక బాధిత మహిళ తిరిగొచ్చిన మహిళ చెప్పిన వాస్తవికత ఆధారంగా తీసిన సినిమా అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. కొంత మంది సెక్యూలరిస్టులు అక్కడ అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తున్న నోరు మెదపకుండా గుజరాత్ లో అమ్మాయిల అదృశ్యంపై ఎందుకు మాట్లాడరు.. అని వితండవాదం చేస్తున్న వారి నోళ్లను గుజరాత్ పోలీసులు మూయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: