రష్యా ఉక్రెయిన్ లోని బాగపుత్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి స్వాధీనం చేసుకుంది. అయితే ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ బాగపుత్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 20,000 మంది సైనికుల్ని కోల్పోయారు. ఉక్రెయిన్ కూడా ఎక్కువ మంది సైనికులని కోల్పోవలసి వచ్చింది. బాగపుత్ నగరం ఎంతో విశిష్టత కలిగినది. దీనిని గులాబీ నగరంగా పిలుస్తారు. ఇక్కడ గులాబీ తోటలు వేల ఎకరాల్లో ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. బాగపుత్ బూడిద అయిన ప్రాంతాన్ని అమెరికా వీడియో ల రూపంలో బయట పెట్టింది.



దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రహస్యం ముఖ్యంగా ప్రస్తుతం హిరోషిమాలో జీ7 సదస్సు జరుగుతుంది. జపాన్ లోని హీరోషిమా పై గతంలో అమెరికా అణు బాంబు ప్రయోగించి. దీని ద్వారా అక్కడ కొన్ని ఏళ్ల పాటు జీవజాలం బతకడానికి కూడా కష్ట మైంది.  అమెరికా దాడి ఎందుకు చేసింది.  ఆ దేశ సార్వభౌమత్వంపై జపాన్ చేస్తున్న దాడిని ప్రతిఘటించింది. ప్రస్తుతం రష్యా లో కూడా అలాంటి పనే చేస్తున్నాం.


అమెరికా చేస్తే ఒప్పు రష్యా చేస్తే తప్ప అని ఎదురు ప్రశ్నించింది. అమెరికా చేసిన అణు దాడి వల్ల జపాన్లోని హిరోషిమా నాగసాకి ప్రాంతాలు ఎంత మేర దెబ్బతిన్నాయో ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. ఇప్పుడు ఏమి ఎరుగన్నట్టు అమెరికా మాట్లాడడం చూస్తుంటే చిత్రంగా ఉందని రష్యా సమాధానం చెప్పింది. ప్రస్తుతం అమెరికా రష్యా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.


బాగ్పుత్ నగరం తీవ్రంగా దెబ్బ తినడంతో ఉక్రెయిన్, అమెరికా రష్యాపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జి7 దేశాల సదస్సును  వేదికగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రష్యా పై వ్యతిరేకత తీసుకురావాలని అమెరికా భావిస్తుంది. ఇంతకంటే ఎక్కువ దాడులు చేసిన అమెరికా సైతం  రష్యా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం ఏమిటని అడుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: