పాకిస్తాన్ లో ఇప్పుడు ప్రభుత్వంలోని వివిధ వర్గాల వారు ఒకరిపై ఒకరు పగలతో రగిలిపోయిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. అక్కడ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ కు  రగులుకున్న ద్వేషం ఒకవైపు.‌ మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు సైన్యానికి రగులుకున్న ద్వేషం మరోవైపు. మరో వైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీలో కూడా ఇలాంటి గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉందట. మరొకవైపు అక్కడ న్యాయస్థానానికి, ప్రభుత్వానికి మధ్య కూడా సంబంధాలు బాగోలేదు అని తెలుస్తుంది.


ఇలా ఇన్ని రకాల గొడవలతో పాకిస్తాన్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా రగులుతుందట. అయితే ఈ గొడవలు అన్నిటిని ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందట అక్కడ ప్రభుత్వం. అయితే ఈ గొడవ మధ్యలో అక్కడ తీవ్రవాదులను  పట్టించుకోవడం కుదరలేదట పాకిస్తాన్ కి. దాంతో వాళ్లు తెహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్లతోను తెహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ జిహాదీ వాళ్ళతోను దశ దిశ నిర్దేశం లేక జట్టు కట్టి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది.  


దాంతో తీవ్ర వాదులందరినీ ఇండియాకు పంపించి వాళ్లకి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తుందట అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. జి20 సమావేశాలు మొదలవుతాయి అని తెలిసినప్పటినుంచే పాకిస్తాన్ కాశ్మీర్ ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అదే ప్రయత్నంలో పలుమార్లు చొరబాట్లకు కూడా పాల్పడింది. సాంబ సెక్టార్ లో ఒక చొరబాటు దారుణ్ణి బి ఎస్ ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పూంచ్ సెక్టార్లో కూడా ఇలా చొరబడుతున్న ఒక చొరబాటు దారుని ఆపిన సైన్యానికి కూడా గాయాలయ్యాయి.


ముగ్గురు చొరబాటు దారులని అరెస్టు కూడా చేశారట. వాళ్ళ దగ్గర ఐ ఈ డి బాంబులు 100 కిలోల వరకు లభ్యం అయ్యాయని తెలుస్తుంది. పాకిస్తాన్ ఇంత విధ్వంసానికి ఎందుకు ప్రయత్నిస్తుందంటే జీ20 కి వచ్చిన దేశాలకి కాశ్మీర్ ఎంతో ప్రశాంతంగా అనిపించిందట. వాళ్లలో ఆ భావన పోగొట్టడానికి వాళ్లు ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: