మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని ఉత్తమ్ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యాం సేఫ్టీ బిల్లును కాంగ్రెస్ పార్టీ, ఎంపీగా ఉత్తమ్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ఎన్డీఎస్ఏ నివేదికలో ఎక్కడా లేదని, అయినా ఉత్తమ్ అసత్యాలతో బురద జల్లుతున్నారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్టును ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.

హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉండి తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం హడావుడిగా పనులు ప్రారంభించి, డీపీఆర్ లేకుండానే బ్యారేజీలు కట్టారని ఆరోపించారు. 160 కోట్ల పనులకు 1426 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2300 కోట్లను దోచుకుందని, ఇందులో ఉత్తమ్, సుదర్శన్ రెడ్డి భాగస్వాములని ఆరోపించారు.

తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని 2015లో కేంద్ర జలసంఘం స్పష్టం చేసిందని హరీశ్ రావు తెలిపారు. మహారాష్ట్ర అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద 280 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చిందని వివరించారు. ఆయకట్టు, జలాశయాల సామర్థ్యం పెరిగితే ప్రాజెక్టు ధర పెరగడం సహజమని సమర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రాణహిత-చేవెళ్ల ధరను 17 వేల కోట్ల నుంచి 38 వేల కోట్లకు పెంచిందని గుర్తు చేశారు.


94905 20108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: