
నిరుద్యోగులకి గుడ్
న్యూస్..ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లోని వివిధ పోస్టల్/ఆర్ఎంఎస్ డివిజన్లలో 245 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన
విడుదలైంది.. 245 పోస్టులలో పోస్టు మ్యాన్ లు , మెయిల్ గార్డ్ లు
వారిగా విభానించారు..వీటిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ వివరాలు
కూడా పొందు పరిచారు.
ఖాళీలు: పోస్టు మ్యాన్ -234; మెయిల్ గార్డ్-11.
రీజియన్ల వారీ ఖాళీలు: విజయవాడ-112 (పోస్టు మ్యాన్ -106+మెయిల్ గార్డ్-6);
కర్నూలు-62 (పోస్టు మ్యాన్ -60+మెయిల్ గార్డ్-2);
విశాఖపట్నం-71 (పోస్టు మ్యాన్ -68+మెయిల్ గార్డ్-3).
జీతం - రూ.21,700+ఇతర అలవెన్సులు.
అర్హతలు: పదోతరగతి/తత్సమాన విద్యలో
ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2018, మార్చి 15 నాటికి 18-27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష.
రాతపరీక్ష విధానం: దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఎలో
జనరల్ నాలెడ్జ్ నుంచి 25, పార్ట్-బిలో మ్యాథమెటిక్స్
నుంచి 25, పార్ట్-సిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25, తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు
లేవు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
రాతపరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు రుసుం: రూ.500 (అప్లికేషన్ ఫీజు-రూ.100+ఎగ్జామినేషన్ ఫీజు-రూ.400). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ అభ్యర్థులకు
ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 15,
2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: appost.in, www.indiapost.gov.in