న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ డిప్లొమా ట్రైనీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా ట్రైనీ ఉద్యోగాల్లో మొత్తం 35 పోస్టులు ఖాలీగా ఉన్నాయి. ఇందులో రెండు విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి.

 

ఎలక్ట్రికల్‌ విభాగంలో 30 ఉద్యోగాలు, సివిల్‌ విభాగంలో 05 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పవర్ గ్రిడ్ సంస్థ తెలియజేస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత అనేది ప్రధాన అర్హత. వయసు 16.12.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

 

ఈ ఉద్యోగాల భర్తీ రాతపరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది డిసెంబరు 16.. మరిన్ని వివరాల కోసం http://powergridindia.com/ వెబ్ సైటును చూడవచ్చు.

 

కేవలం పాలిటెక్నిక్ చదువుకున్నవారికి ఇది మంచి ఉద్యోగ అవకాశం. పదోన్నతుల ద్వారా భవిష్యత్తులో మంచి స్థానం పొందే అవకాశం ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: