జూన్ 19వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు... జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 ఆశిష్ విద్యార్థి జననం : భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఈయన 1962 జూన్ 19వ తేదీన జన్మించారు. ఆశిష్ విద్యార్థి తన నటనకు గాను నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని అన్ని భాషల చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు ఆశిష్ విద్యార్థి. పోకిరి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఎంతగానో ఎంత సంపాదించారు. 

 


 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి జననం : 20వ దశాబ్దంలో భాషా శాస్త్ర కోవిదులలో  ఎంతగానో పేరెన్నికగన్న వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. 1928 జూన్ 19వ తేదీన జన్మించారు. భాషాశాస్త్రానికి సమగ్రంగా అధ్యయనం చేసి ఔపాసనం  చేయగల సత్తా ఆయనలో ఉంది అని నిరూపించుకున్న వ్యక్తి  ఈయన . ద్రావిడ భాషా శాస్త్ర విజ్ఞానంతో  ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాడు. 2012 ఆగస్టు 11వ తేదీన పరమపదించారు. ఈయన తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నో పరిశోధనా గ్రంథాలు వ్యాసాలు రచించారు. 

 

 కాజల్ అగర్వాల్ జననం : ప్రముఖ భారతీయ నటి అయిన కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19వ తేదీన జన్మించారు. ఈమె  2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆ తర్వాత 2010లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రాజమౌళి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది  కాజల్ అగర్వాల్. ఇక దశాబ్దకాలంపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది, తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అంతేకాకుండా హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 లో నటిస్తుంది కాజల్ అగర్వాల్. 

 


 జంధ్యాల మరణం  : తెలుగు సినిమా రచయితగా దర్శకుడిగా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన చిత్ర పరిశ్రమలో ఇంటి పేరు తోనే ఎంతగానో సుప్రసిద్ధులయ్యారు ప్రత్యేకించి హాస్య కథా చిత్రాలు తీయడంలో జంధ్యాలకు ఎవరు సాటి లేరు అని చెప్పాలి, ఇక జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం అన్నది ఇప్పటికీ కూడా ఎంతోమంది పాటిస్తూ ఉన్నారు. 1951 జనవరి 14 వ తేదీన జన్మించారు జంధ్యాల ఎన్నో  హాస్యభరితమైన చిత్రాలను తెరకెక్కించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈయన 2001 జూన్ 19వ తేదీన పరమపదించారు. 

 

 నేరెళ్ళ వేణుమాధవ్ మరణం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు... ధన్యనూకరణ  సామ్రాట్ అనే బిరుదు కూడా పొందిన వ్యక్తి ఆయన నేరెళ్ళ వేణుమాధవ్ 1952 డిసెంబర్ 28వ తేదీన జన్మించారు. ఈయన 1947 నుండే మిమిక్రి ప్రదర్శనలు  ఇవ్వడం ప్రారంభించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు నేరెళ్ళ వేణుమాధవ్. కేంద్ర ప్రభుత్వం ఈయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందిm 2008 జూన్ 19వ తేదీన పరమపదించారు నేరెళ్ల వేణు మాధవ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: