నూతన దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. పివిపి నిర్మించిన ఈ చిత్రం స్పానిష్ థ్రిల్లర్ 'ది ఇన్విజిబుల్ గెస్ట్' కు రీమేక్ గా తెరకెక్కింది. అయితే తెలుగు నేటివిటీ కి తగ్గట్లు చాలా మార్పులు చేశారు. ఇక ఈ చిత్రం తరువాత అడివి శేష్ ,'మేజర్' అనే చిత్రంలో నటించనున్నాడు. 11/26 ముంబై దాడుల్లో మరణించిన ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో నటించనున్నాడు శేష్. ఈ పాత్ర కోసం అతను ఏకంగా 10 కిలోల బరువు తగ్గనున్నాడట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో లో వున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ జి ఏం బి ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇక ఈ చిత్రంతో పాటు గత ఏడాది విడుదలై సూపర్ హిట్ సాధించిన యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న చిత్రంలో కూడా నటించనున్నాడు శేష్ . గూఢచారి 2 అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.