ఒకప్పుడు తమిళ లిటిల్ స్టార్ శింబు తర్వాత హీరోగా మారాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్లో టీ.రాజేంద్రన్ యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, ప్రొడ్యూసర్గా మూడు దశాబ్దాలకు పైగా కోలీవుడ్ను ఏలారు. ఆయన వారసుడిగా శింబు తెరంగేట్రం అంటే మామూలుగా ఉండదు కదా? అదే జరిగింది. చిన్నప్పటి నుంచీ సినిమా పరిశ్రమను చాలా దగ్గరగా చూశారు శింబు.
పైగా తండ్రికి తగ్గ తనయుడిగా శింబు కూడా ట్వంటీఫోర్ ఫ్రేమ్స్లో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. హీరోగా ఎప్పుడైతే మారాడో అప్పటి నుంచి శింబు పై రక రకాల రూమర్సు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నటి నయనతారతో ప్రేమాయణం..తర్వాత హన్సిక ఇలా కొంత మంది హీరోయిన్లతో లవ్ ఎఫైర్స్ ఆ మద్య మహిళలను కించ పరుస్తూ పాట పాడాడని కోర్టు కేసు ఇలా ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు శింబు. దాంతో ఆ మద్య సినిమాల్లో ఛాన్సులు కూడా తక్కువ అయ్యాయి.
గత కొంత కాలంగా ఆయనపై వరుసగా నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ ఏమీ బాగోలేదని, సినిమాలు చేస్తానని ఒప్పుకుని వాటిని మధ్యలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై ఇప్పటికి ఐదుగురు పెద్ద నిర్మాతలు కంప్లైంట్ చేసారు. ఈ నేపధ్యంలో విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో శింబు ప్రధాన పాత్ర పోషించిన 'అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్' చిత్రంతో తనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత మైఖేల్ రాయప్పన్ పేర్కొన్నారు. గొరిల్లా చిత్ర నిర్మాత సురేష్ ఫిర్యాదు చేశారు.
సురేష్ కామాక్షి అనే మరో నిర్మాత కూడా శింబు హీరోగా తాను నిర్మించతలపెట్టిన 'మానాడు' చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఎస్కేప్ ఆర్ట్స్కు చెందిన నిర్మాత మదన్ చేసిన కంప్లైంట్ లో.. తన చిత్రంలోనూ శింబును నటింపజేయడానికి ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఆయన సహకరించని కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆరోపణల్లో వాస్తవమున్న పక్షంలో శింబు ఇబ్బంది పెట్టనవారందరికీ నష్ట పరిహారం ఇప్పించడం, ఆయనపై చర్యలు తీసుకోవడం వంటివి ఘటనలు జరిగే అవకాశం ఉందని నిర్మాతల మండలి సభ్యులు మీడియా తెలిపారు. ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ మూవీని శింబూతో నిర్మించే ప్రయత్నం చేయగా షూటింగ్ పనులు ప్రారంభమైనప్పటికీ ఆయన సహకరించక పోవడంతో ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయిందన్నారు.