ప్రముఖుల ఇళ్లలో జరిగే ఏ శుభకార్యమైనా, పండుగైనా ఎంతో ఘనంగా జరుగుతాయి. అదే దేశంలోనే అత్యంత సంపన్నుడు, ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ ఇంట ఓ పండుగ జరిగితే అత్యంత సువర్ణశోభితంగా జరుగుతుంది. వినాయకచవితి పండుగను ఆయన ఇంట అత్యంత ఘనంగా జరిపించి ముఖేశ్ ఇదే విషయాన్ని నిరూపించారు. ప్రముఖ బాలీవుడ్ నటులు, వ్యాపార దిగ్గజాలు అందరూ ఈ పండుగకు విచ్చేశారు.

 


ప్రతి ఏటా అంబానీ కుటుంబం వినాయకచవితి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. అయితే ఈసారి ఉండ్రాళ్ల పండుగ వారింట్లో కొత్త సంతోషాల్ని నింపింది. కారణం ముఖేశ్ కుమారుడు, కూతురు దంపతులుగా ఈ ఇంట మొదటి వినాయకచవితి పండుగను జరుపుకోవడమే. దీంతో ఈ సందర్భాన్ని ముఖేశ్ అంతే సందడిగా మార్చేశారు. బాలీవుడ్ నటులను తన కలల సౌధమైన ఆంటీలియాకు ఆహ్వానించి పండుగను జరుపుకున్నారు. ఈ సంబరాల కోసం ఆంటీలియాను విద్యుత్ దీపాల కాంతులతో నింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అమీర్ ఖాన్, కృతి సనన్, కత్రినా కైఫ్, కరిష్మా కపూర్, మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, కాజోల్, విద్యా బాలన్, అలియా భట్, రణబీర్ సింగ్, అదితీ రావ్ హైదరీ తదితరుల నటుల రాకతో ఈ వేడుకలో శోభాయమానంగా మారిపోయింది.

 


ముఖేశ్-నీతా దంపతులతోపాటు ఆమె కుమార్తె, అల్లుడు ఇషా అంబానీ-ఆనంద్ పిరామల్, కొడుకు ఆకాశ్ దంపతులకు కూడా ఇది తొలి వినాయకచవితి పండుగ. దీంతో ఈ దంపతులందరూ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథుల రాకతో ఆంటీలియా అంతా సందడిగా మారిపోయిందిఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు ముఖేశా.. మజాకా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: