ఒక్కోసారి ఈ పయనాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే సంతోషం కలుగుతోందని నటి ప్రియమణి చెప్పారు . నటిగా ఈ కొత్త సంవత్సరం తనకు ఇంకా బాగుంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె ది ఫ్యామిలీమెన్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నానని, ఇందులో ప్రియమణి సుచిత్రా తివారి అనే పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. నిజానికి ఇందులో ముంబాయిలో నివసించే తమిళ అమ్మాయి పాత్ర అనగానే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది.
ప్రస్తుతం సీజన్ 2 చిత్రీకరణ జరుగుతోందని, ఇందులో నటి సమంత కూడా పాల్గొననున్నట్లు తెలిపింది. అంతేకాదు తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని సన్నివేశాల్లో తనను పోల్చుకునేలా సన్నివేశాలు ఉన్నాయంది. ఇందులో భార్యాభర్తల మధ్య చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలు ఉన్నాయని చెప్పింది. నిజ జీవితంలో తనకు తన భర్తకు జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయని అంది. తానే కాదు అందరూ కనెక్ట్ అయ్యేల యధార్థ సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పింది.
చాలా మంది తన డ్రీమ్ రోల్ ఏమిటని అడుగుతున్నారని, పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ చేసిన నీలంబరి పాత్ర మాదిరి ఒక నెగిటివ్ పాత్ర చేయడం తన డ్రీమ్రోల్ అని చెప్పింది. నిజానికి తన వాయిస్ నెగిటివ్ పాత్రలకు బాగుంటుందని ఆమెకి చాలా మంది చెబుతుంటారని పేర్కొంది. అలాంటి పూర్తి స్థాయి ప్రతినాయకి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రియమణి చెప్పింది. తాను ప్రారంభ దశలోనే భారతీరాజా, బాలుమహేంద్ర వంటి లెజెండ్రీ దర్శకుల చిత్రాల్లో నటించానంది. అయితే ఇక్కడ తనకుంటూ ఒక స్థానం లభించలేదన్న బాధ ఉందా? అంటే కచ్చితంగా ఉందనే చెబుతానంది.
తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటిచాలన్న తన కోరిక తీరలేదని ప్రియామణి చెప్పింది. ఆ ఆశ ఇప్పటికీ ఉందని అంది. కాగా తమిళంలో జయలలిత బయోపిక్గా తెరకెక్కనున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోందని, అయితే అది ఇప్పుటికి న్యూస్గానే ఉందని, ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పింది. ఆ చిత్రంలో తాను నటిస్తున్నానా? లేదా? అన్నది ఆ చిత్ర వర్గాల నుంచే ప్రకటన రావాలని ప్రియమణి పేర్కొంది.