తెలుగు చిత్ర పరిశ్రమలో అడ‌వి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. క్ష‌ణం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన యువ హీరో అడివి శేష్‌. ఈ సినిమా త‌ర్వాత అడివి శేష్ న‌టించిన చాలా చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో ఇప్పుడు ఆయ‌న సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే రీసెంట్‌గా సుమంత్ న‌టించిన క‌ప‌ట‌ధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన అడ‌వి శేష్ త‌న‌కు జ‌రిగిన ఓ అనుభవం గురించి వివ‌రించాడు.

ఇక పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ సారి ఔట‌ర్ రింగ్ రోడ్‌లో కారు వెళుతుండ‌గా, అడ‌వి శేష్ కారు పోలీసులు ఆపార‌ట‌. హై స్పీడ్ వ‌ల‌న  అత‌ని కారుపై ఆరు చ‌లానాలు ఉండ‌గా, ట్రాఫిక్ పోలీసులు ఆ చలానా క‌ట్టించి పంపార‌ట‌.  ఈ విష‌యాన్ని క‌ప‌ట‌ధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒప్పుకున్నాడు. క‌ప‌ట‌ధారి చిత్రం  ముప్పై ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ హ‌త్య‌కేసును ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎలా సాల్వ్ చేశాడ‌నే కథాంశంతో రూపొంద‌గా,  ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌కు యాంక‌ర్ శ్యామ‌ల ట్రాఫిక్ ఎస్సై వేషంలో వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో శ్యామ‌ల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో  అడివిశేష్ ఈ విష‌యాన్ని రివీల్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

ఇక క‌ప‌ట‌ధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విష‌యాన్ని అడివిశేష్ చెప్పాడు. ముప్పై ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ హ‌త్య‌కేసును ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎలా సాల్వ్ చేశాడ‌నే కథాంశంతో రూపొందిన చిత్ర‌మే క‌ప‌ట‌ధారి. వేడుక‌లో పాల్గొన్న యాంక‌ర్ శ్యామ‌ల ట్రాఫిక్ ఎస్సై వేషంలో వ‌చ్చి అడిగిన‌ప్పుడు అడివిశేష్ ఈ విష‌యాన్ని రివీల్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఇక విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఒక‌ట్రెండు సినిమాల్లో మెప్పించి హీరోగా మారిన యాక్ట‌ర్‌. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి చిత్రాల్లో హీరోగా త‌న‌దైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ మేజ‌ర్‌తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: