కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించడంతో సినీ ఇండస్ట్రీలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన కారణంగా సెలబ్రిటీలకు చాలా వరకూ సమయం  దొరుకుతుంది. దీంతో కొంత మంది సెలబ్రెటీలు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఎక్కువగా ఆన్ లైన్ లోనే ఉండడంతో సెలబ్రెటీలు తమ రోజువారీ దినచర్య లో జరిగే సంగతులన్నీ ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అది కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ముందుగా అనసూయ తన ఇంట్లో ఏలాంటి చిన్న ఫంక్షన్ జరిగినా,  ఎక్కడ టూర్ కి వెళ్ళినా,  వాటికి సంబంధించిన ఏదో ఒక వీడియోని క్రియేట్ చేసిన ముందుగా సోషల్ మీడియాలోనే పోస్ట్ పెడుతుంటుంది అనసూయ. తన ఇంట్లో పెంచుకుంటున్న పక్షికి ముద్దు పెడుతూ తన భార్య అని చెబుతున్న యాంకర్ అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా  మారింది.




ఇక మరో యాంకర్ లు శ్రీముఖి, విష్ణుప్రియ లు ఒకే దగ్గర ఉన్నట్లు ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో వీరిద్దరూ డాన్స్ చేస్తున్నారు. ఇక ఈ డాన్స్ చూసిన అభిమానులు డాన్స్ మీరు ఇరగదీశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారు ఇంట్లోనే ఉన్నామని చెబుతూనే చిన్న చిన్న డ్రస్సులు వేసుకుంటూ, చేసిన వీడియో కూడా తెగ పాపులర్ అవుతోంది.



యాక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. మంచు లక్ష్మి కూడా తన జిమ్ లో వర్కవుట్ చేస్తున్నట్లు తన కూతురుతో  కలసి ఎన్నో కసరత్తులు చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.





ఇక మరో సెలబ్రెటీ మధుప్రియ. ఈమె ఫిదా సినిమాతో పాటలు పాడే స్థానం సంపాదించుకొని, సరిలేరు నీకెవ్వరు లో మరోసారి పాడి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇటీవల తన అక్క బావ పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: