ఇటీవలకాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి కొత్త రక్తం ఉరకలు వేస్తుంది. ఇన్నాళ్లు వారసత్వంతో కొంతమంది హీరో లు వచ్చి సినిమాలు చేస్తుండగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలు చేసి రాణిస్తున్నారు కొంతమంది హీరోలు.. అలా విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లు ఇప్పటికే స్టార్ హీరోలు గా ఎదగగా మరింతమంది హీరోలు సైతం వీరి బాటలో పయనిస్తూ సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా తాజాగా ఏక్ మినీ కథ సినిమా తో సూపర్ హిట్ కొట్టిన సంతోష్ శోభన్ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో గోల్కొండ హై స్కూల్ సినిమా తో పరిచయమై తను నేను తో హీరో గా మారాడు సంతోష్ శోభన్.. వర్షం , బాబీ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శోభన్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి సినిమాలతో అలరించాడు.. తొలి రెండు సినిమాలతో అలరించిన సంతోష్ శోభన్ మూడో సినిమా పేపర్ బాయ్ తో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.ఇక తాజాగా అయన హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది..

సినిమా ఫ్రెష్ కామెడీ తో తెరకెక్కి మంచి హిట్ ని అందుకుంది.. యాక్టింగ్ లో లో కూడా మనోడికి మంచి మార్కులే పడ్డాయి.. ఈ సినిమా ద్వారా మంచి అవకాశాలు వస్తాయని ముందే ఊహించాడనుకుంటా ఈ సినిమా రిలీజ్ అయినా వెంటనే ఓ పెద్ద నిర్మాత సంతోష్ కి ఓ ఆఫర్ ఇచ్చాడట. జయంతీ మూవీస్‌ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది. కొత్త దర్శకుడి ఈ సినిమాను రూపొందిస్తున్నారట. సారంగ ప్రొడక్షన్స్‌ సంస్థలో అభిషేక్‌ మహర్షి అనే మరో కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందట. ఇదంతా చూస్తుంటే సంతోష్‌ శోభన్‌ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: