ప్రస్తుతం యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ తీస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటులు రావురమేష్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలు చేస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర అనే మెయిన్ విలన్ పాత్ర చేస్తుండగా రమిక సేన్ అనే పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్ 2 ని కూడా హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతాన్ని, భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇక ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం అలానే అది సినిమాపై అందరిలో మరింతగా అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. అయితే చాప్టర్ 2 సినిమాని మొదటి భాగం కంటే కూడా మరింత అద్భుతంగా భారీ లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలు, యాక్షన్ అంశాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం, ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించిందట.

దీనికి సంబందించిన అప్ డేట్ మరికొద్దిరోజుల్లో రానుందని, ఇక ఫస్ట్ సాంగ్ విడుదల తరువాత సినిమాపై అందరిలో అంచనాలు ఏకంగా తారాస్థాయికి చేరుకుంటాయని, అలానే సినిమా కూడా రేపు విడుదల తరువాత తప్పకుండా అంచనాలు అందుకుని గొప్ప విజయం అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. మరి ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఫస్ట్ సాంగ్ విడుదలకు సంబంధించి ప్రచారం అవుతున్న  వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: