సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకి రావడమే కష్టం. అలా వచ్చినా హీరో గా సక్సెస్ అవ్వడం మహా కష్టం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే కొందరు పెద్ద వాళ్లు అలాంటివారిని తొక్కేస్తారంటూ గత కొన్నీ సంవత్సరాల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అదృష్టం కొద్ది కొందరు.. కష్టానే నమ్ముకున్న కొందరు..సినీ ఇండస్ట్రిలోకి వచ్చి హీరోగా సక్సెస్ అయ్యారు.

ఇక అలాంటివారిలో రవితేజ కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా..ఆ తరువాత సినిమాలో చిన్న క్యారెక్టర్ లు వేస్తూ వచ్చిన ఆయన ఒక్కసారిగా హీరో గా మారి తనలోని మాస్ యాంగిల్ ను కూడా బయటపెట్టారు. దీంతో ఆయనకు అభిమానులు మాస్ మహారాజ అనే బిరుదుని కూడా ఇచ్చారు. ఇక పూరి జగన్నాధ్ రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇడియట్ సినిమా గురించి అసలు చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తుంటే చూసి ఎంజాయ్ చేసే వాళ్లు ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఆ సినిమాలో ని డైలాగ్స్ ఇప్పటికి తండ్రి కొడుకుల సంభాషణల్లో  వస్తుంటాయి. అప్పట్లో  రవి తేజ క్రేజ్ అలా ఉండేది. నిజం చెప్పలంటే ప్రస్తుత కాలంలో రవితేజకు అంత ఫాలోయింగ్ లేదనే చెప్పాలి.

ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న రవితేజకి డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని.. క్రాక్ సినిమాతో తిరుగులేని విజయాని అందించారు. తాజాగా బాలయ్య షోకి గెస్ట్ గా వెళ్లిన రవితేజ తన గురించి ఎవ్వరికి తెలియని తేజ చెప్పి షాక్ ఇచ్చారు. తాను నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే ఆయన పారితోషకంలో సగం మళ్ళీ రిటర్న్ చేసేస్తారట. ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదట. ఇక ఈ విషయం విన్న ఆయన అభిమానులు రవితేజ ది ఎంత  మంచి మనసు అంటూ..మేం రవి తేజ ఫ్యాన్స్ అని గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: