ప్రస్తుతం ఎ చిత్ర సీమలోనైనా ఎక్కువగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖులు అకాల మరణం చెందుతూనే ఉన్నారు. తాజాగా శాండిల్ వుడ్ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ డైరెక్టర్ మరణించడం జరిగింది. ఇక డైరెక్టర్ పేరు ప్రదీప్ రాజ్.. ఈయన వయసు 46 సంవత్సరాలు కరోనా కారణంగా గురువారం రోజున మరణించడం జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీ, ప్రదీప్ రాజ్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయారు. గత 15 రోజుల నుంచి.. ప్రదీప్ రాజ్ కరోనా పాజిటివ్ రావడంతో.. బెంగళూరు లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు.

అయినా కూడా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈయనకు షుగర్ వంటి జబ్బు ఉండడంతో ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారిపోయింది అని వైద్యులు తెలియజేసినట్లు గా కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో ఆయన మరణించారని సన్నిహితులు కూడా తెలియజేశారు. చికిత్స పొందుతున్న సమయంలో ప్రదీప్ రాజ్ కన్నుమూయడం జరిగిందిట.ఆయన సొంత ఊరు పాండిచ్చేరి కావడంతో కుటుంబ సభ్యులు , సన్నిహితులు అంత్యక్రియలను అక్కడ నిర్వహించనున్నట్లు గా తెలియజేశారు. హీరో యష్ తో కూడా 2011వ సంవత్సరంలో కిరాతక అనే మూవీ ని తెరకెక్కించి మంచి సూపర్ హిట్ ని ఇచ్చాడు డైరెక్టర్ ప్రదీప్ రాజ్

ఇక అంతే కాకుండా కిరాతక -2 మూవీ కూడా తీయడానికి ప్రదీప్ రాజు గతంలో అనౌన్స్మెంట్ కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ కల నెరవేర్చుకుంది అనే ఆయన మరణించడం జరిగింది. అయితే ప్రదీప్ రాజ్ డైరెక్షన్ లో ఎన్నో మంచి సినిమాలు విడుదల కావడం జరిగింది. ఇక ఈయన మరణం తో కన్నడ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైయింది.ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: