అయినా కూడా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈయనకు షుగర్ వంటి జబ్బు ఉండడంతో ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారిపోయింది అని వైద్యులు తెలియజేసినట్లు గా కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో ఆయన మరణించారని సన్నిహితులు కూడా తెలియజేశారు. చికిత్స పొందుతున్న సమయంలో ప్రదీప్ రాజ్ కన్నుమూయడం జరిగిందిట.ఆయన సొంత ఊరు పాండిచ్చేరి కావడంతో కుటుంబ సభ్యులు , సన్నిహితులు అంత్యక్రియలను అక్కడ నిర్వహించనున్నట్లు గా తెలియజేశారు. హీరో యష్ తో కూడా 2011వ సంవత్సరంలో కిరాతక అనే మూవీ ని తెరకెక్కించి మంచి సూపర్ హిట్ ని ఇచ్చాడు డైరెక్టర్ ప్రదీప్ రాజ్
ఇక అంతే కాకుండా కిరాతక -2 మూవీ కూడా తీయడానికి ప్రదీప్ రాజు గతంలో అనౌన్స్మెంట్ కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ కల నెరవేర్చుకుంది అనే ఆయన మరణించడం జరిగింది. అయితే ప్రదీప్ రాజ్ డైరెక్షన్ లో ఎన్నో మంచి సినిమాలు విడుదల కావడం జరిగింది. ఇక ఈయన మరణం తో కన్నడ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైయింది.ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి.