భార్య భర్తలన్నాక ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కలకాలం కలిసి ఉండాలి కానీ అలా ఎవరి దారి వారు చూసుకుంటే ఎలా? అయ్యయ్యో వద్దమ్మా అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. విడిపోయిన వాళ్ళిద్దర్నీ కలిసిపోవాలంటున్నారు. సెలబ్రిటీ కపుల్ ధనుష్,ఐశ్వర్య విడిపోవడం ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ ను తీవ్రంగా బాధిస్తోందట. విడాకుల విషయం పై మరోసారి ఆలోచించాలని ఇద్దరిని రజిని కోరనున్నట్లుగా తెలుస్తోంది. తాత్కాలిక గొడవలకే విడిపోవడం కరెక్ట్ కాదని రజిని వాళ్ళకు నచ్చచెప్పినట్లుగా సమాచారం.

 ఇక ఈ విషయంపై ఇద్దరినీ కూర్చోబెట్టి రజనీకాంత్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు రజినీకాంత్ గారే పరిష్కరించారు. వాళ్ళిద్దరికీ ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకున్నారు. కానీ ఇలా అనుకోకుండా ధనుష్,ఐశ్వర్య విడిపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసిందట. అయితే ఆయనే డైరెక్ట్ గా సీన్లోకి దిగాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ధనుష్,ఐశ్వర్య లు చెన్నై కి రాగానే వారితో మాట్లాడుదామని,త్వరలోనే వాళ్ళిద్దరు మళ్లీ కలుస్తారని ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇప్పటికే చెప్పారు కూడా. ఇక ప్రస్తుతం ధనుష్,ఐశ్వర్య ఒకేచోట,ఒకే హోటల్ లో ఉన్నారు.వ్యక్తిగత విషయాలతో డిస్టబైన వీళ్లిద్దరు అప్పుడే తమ తమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉండగా, అటు ఐశ్వర్య కూడా లవ్ సాంగ్ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది. తమ ప్రాజెక్టులు పూర్తి చేయగానే వాళ్ళిద్దరు రామోజీ ఫిలింసిటీ లో బస చేస్తున్నారు. పది రోజుల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ మళ్లీ కలుసుకోవాలని అభిమానులు కూడా  కోరుకుంటున్నారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా, రజినీకాంత్ ఇద్దరూ రంగంలోకి దిగారు. వారిద్దరినీ తిరిగి కలిపేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు సర్వసాధారణమని, ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా అలాంటి గొడవలు జరిగాయని చెప్పారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాను రజనీకాంత్ కోరినట్లు చెప్పారు కస్తూరి రాజా.

వీరిద్దరి మధ్య సమస్యలు పరిష్కరించడానికి రజినీకాంత్ చాలా ప్రయత్నం చేశారట. కానీ ఎంతకూ ఇద్దరూ వినకపోవడంతో చివరకు ఇష్యూ విడాకుల దాకా వచ్చిందని కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వీరి విడాకుల విషయం పై రజినీకాంత్ చాలా బాధ పడినట్లుగా తెలుస్తోంది. అందుకే విడాకుల విషయాన్ని పునరాలోచించుకోవాలని వారిద్దరిని ఆయన కోరినట్లుగా సమాచారం. రజినీకాంతే కాదు చాలా మంది సినీ ప్రముఖులు, సన్నిహితులుఇదే విషయాన్ని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి రజనీకాంత్ మాటలు గౌరవించి వాళ్ళిద్దరూ కలిసి పోతారో లేదా తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: