రోజురోజుకు వీరిపై వస్తున్న ట్రోల్స్ కు విసిగిపోయిన మోహన్ బాబు ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటివరకు తమపై.. తమ కుటుంబంపై అలాగే సినిమా పై చేసిన ట్రోల్స్ అలాగే మీమ్స్ వెంటనే తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెట్టి రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని.. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున శేషు కుమార్ అనే వ్యక్తి ట్రోలర్స్ ను హెచ్చరిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది..
ఇకపోతే సన్ ఆఫ్ ఇండియా సినిమా పై నెటిజన్లు సైతం మంచి ఫ్యామిలీని ట్రోల్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా మోహన్ బాబు సినిమా గురించి పక్కన పెడితే మా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మంచు విష్ణు పలికే పదాల ఉచ్చారణ పై కూడా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ సీరియస్ గా తీసుకుంది.. ఇక మీమర్స్ వెంటనే వాటిని తొలగిస్తారో లేదో వేచి చూడాలి మరి.