ఆర్ ఆర్ ఆర్ సినిమా టికెట్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులో తీవ్ర వివాదం తలెత్తింది. అటు నందమూరి అభిమానులకు.. ఇటు మెగా అభిమానులకు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం దగ్గర అభిమానులు పంచాయతీ పెట్టడం జరిగింది.. టికెట్ల విషయంలో తమకు పూర్తిస్థాయిలో అన్యాయం చేశారు అని థియేటర్ యాజమాన్యం పై మెగా అభిమానులు మండిపడుతున్నారు.. ఇకపోతే గత మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదలకు ముందే అభిమానులు గొడవకు దిగారు. కాకపోతే ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడంతో అభిమానులు కూడా ఫ్యాన్సీ షో టిక్కెట్లు కావాలని రెండు వర్గాలు పట్టుబట్టడం పరోక్షంగా రాజకీయ నేతల హస్తం కూడా ఉందని విషయంపై స్థానిక థియేటర్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఇకపోతే ఒక హీరో అభిమానులు వచ్చి సింహభాగం టికెట్లు తమకే కావాలని పట్టుబట్టగా ఇది తెలుసుకున్న మరో హీరో అభిమానులు గొడవకు దిగారు. అంతేకాదు గందరగోళంగా మారిన పరిస్థితులలో థియేటర్లో ఒక తెలుపుతో పాటు అద్దాలకు కూడా అభిమానులు ధ్వంసం చేసి నానా రభస సృష్టించారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా.. మరింత ఉద్రిక్తం చోటుచేసుకుంది. ఇకపోతే విడుదల సందర్భంగా పద్మశాలి పేటకు చెందిన కొంతమంది అభిమానులు ఇద్దరూ కథానాయకుల ఫోటోలను పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ఇక అభిమానం ఎంతలా ఉంది అంటే హీరోల చిత్రాలకు రక్త తిలకం కూడా దిగారు. ప్రపంచవ్యాప్తంగా  భారతీయులు ఉన్నచోట్లలో ఆర్ ఆర్ ఆర్  సినిమా మేనియా నడుస్తోంది.. ఇప్పటికే బెనిఫిట్ షో లతోపాటు ప్రీమియర్ షోలు కూడా మొదలవడం జరిగింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ తోపాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ ,సముద్రకని కీలక పాత్రలు పోషించారు. విడుదలకు  ముందే రికార్డు సృష్టించిన ఈ సినిమా ఈ రోజు మొదటి షో తో మరి కొన్ని రికార్డులను చెరిపివేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: