టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నడు అడవి శేష్. తొలుత
హీరో పాత్రలు కాకుండా ఇతర పాత్రలలో నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్న ఈ
హీరో క్రమక్రమంగా మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించి పాపులారిటీని సంపాదించుకున్నాడు. క్షణం
సినిమా ద్వారా ఆయన మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత గూడచారి సినిమాతో ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ ను సైతం ఏర్పరుచుకున్నాడు.
అంతే కాదు కొన్ని
థ్రిల్లర్ సినిమాలతో సైతం ఈ
హీరో ఆకట్టుకొని ప్రేక్షకులను ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు చేస్తున్న మేజర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సూపర్ స్టార్
కృష్ణ తనయుడు మహేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడమే ఈ
సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని చెప్పడానికి ముఖ్య కారణం. అంతేకాదు ఈ సినిమాను గూడచారి
సినిమా చేసిన దర్శకుడు శశి
కిరణ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రం కూడా గూడాచారి లాంటి తరహా
సినిమా కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతూ ఉండగా అక్కడ ఓ స్క్రీన్ షాట్ ను చేసి తన సోషల్
మీడియా ఖాతా ద్వారా విడుదల చేశాడు అడవి శేష్. ఆ విధంగా ఈ
సినిమా పై అంచనాలు కూడా భారీగా పెంచాడు. ఈ పోస్టు చూసిన వారంతా కూడా ఈ సినిమాలో ఇంకా ఎన్ని ఇలాంటి మంచి అంశాలు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. మరి వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న అడవి శేషు ఈ పాన్
ఇండియా సినిమా తో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాన్
ఇండియా హీరోగా నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి.