టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నడు అడవి శేష్.  తొలుత హీరో పాత్రలు కాకుండా ఇతర పాత్రలలో నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో క్రమక్రమంగా మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించి పాపులారిటీని సంపాదించుకున్నాడు. క్షణం సినిమా ద్వారా ఆయన మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో.  ఆ తర్వాత గూడచారి సినిమాతో ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ ను సైతం ఏర్పరుచుకున్నాడు.

అంతే కాదు కొన్ని థ్రిల్లర్ సినిమాలతో సైతం ఈ హీరో ఆకట్టుకొని ప్రేక్షకులను ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు చేస్తున్న మేజర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడమే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని చెప్పడానికి ముఖ్య కారణం.  అంతేకాదు ఈ సినిమాను గూడచారి సినిమా చేసిన దర్శకుడు శశి కిరణ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రం కూడా గూడాచారి లాంటి తరహా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా పెరిగిపోయాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతూ ఉండగా అక్కడ ఓ స్క్రీన్ షాట్ ను చేసి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశాడు అడవి శేష్. ఆ విధంగా ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా పెంచాడు. ఈ పోస్టు చూసిన వారంతా కూడా ఈ సినిమాలో ఇంకా ఎన్ని ఇలాంటి మంచి అంశాలు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. మరి వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న అడవి శేషు ఈ పాన్ ఇండియా సినిమా తో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: