టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత గా ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ ప్రారంభం అయింది కూడా డిస్ట్రిబ్యూటర్ గానే. మొదట్లో చిన్న చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే స్థాయికి ఎదిగాడు. అలా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను సైతం చేసే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఆయన నిర్మాత గా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు చేయగా అవి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ఇకపోతే ఆయన నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్ గా మంచి రికార్డు ఉంది. ఆయన ఏ చిత్రమైనా ముందుగానే అంచనా వేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. లేదంటే దానిని వదిలేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆచార్య సినిమాకు ఆయన నైజాం హక్కులు తీసుకోకపోవడం మంచిదయింది. ఆ సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడగా దానిని ఈ నిర్మాత తీసుకోకుండా వదిలేశాడు. అలా వదిలేయడం మంచిది అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోతుంది. అలా దిల్ రాజు సేఫ్ అయ్యాడనే చెప్పాలి. 

తాజాగా దిల్ రాజు మహేష్ సర్కారు వారి పాట చిత్రం యొక్క హక్కులను అందుకున్నాడు. నైజాంలో ఈ సినిమా ను భారీ స్థాయి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమా తనకు కలిసి వస్తుందని నమ్ముతున్నాడు దిల్ రాజు. మరి తన సినిమాల విషయంలో లో చాలా క్లారిటీ గా ఉండే దిల్ రాజు ఈ చిత్రంతో ఏవిధమైన విజయాన్ని అందుకుంటాడో చూడాలి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మే 12వ తేదీన ఈచిత్రం విడుదల కావడానికి సిద్దంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: