ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ చాప్టర్ 2 ఇండియా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇంకా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. కన్నడలో తెరకెక్కి మూడున్నరేళ్ల క్రితం ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా మొదటి చాప్టర్ ని మించేలా ప్రస్తుతం మరింత అత్యద్భుతంగా కలెక్షన్స్ రాబడుతుండడంతో యూనిట్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. హీరో యాష్, రాఖీ భాయ్ గా కనబరించిన అత్యద్భుత నటన, దర్శకడు ప్రశాంత్ నీల్ గొప్ప దర్శకత్వ ప్రతిభ, భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్, హై టెక్నీకల్ వాల్యూస్ కెజిఎఫ్ చాప్టర్ 2 ని ప్రేక్షకాభిమానులకి చేరువ చేశాయని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు అటు నార్త్ లో సైతం అద్భుతంగా కలెక్షన్ రాబడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్ గా రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ని ఇటీవల సొంతం చేసుకుంది. మరొక మూడు రోజుల్లో ఇటీవల రిలీజ్ అయి భారీ విజయం సొంతం చేసుకున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఓవరాల్ కలెక్షన్ ని ఇది దాటేసే ఛాన్స్ గట్టిగా ఉందని అంటున్నారు అనలిస్టులు. కాగా ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం రూ. 1150 కోట్ల మేర కలెక్షన్ అందుకుందని, దీనిని బట్టి మొత్తం కలెక్షన్స్ పరంగా బాహుబలి, దంగల్ తరువాత స్థానంలో కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా నిలుస్తుందని వారు అంటున్నారు. ఆ విధంగా అన్ని సినిమాల రికార్డ్స్ తుడిచిపెడుతూ కెజిఎఫ్ చాప్టర్ మూవీ దూసుకెళుతోంది. మరి మొత్తంగా ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: