టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి.ఈయన ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా  ఇటీవలే దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే.ఇకపోతే  ఆ మధ్య డర్టీ హరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అడల్ట్ సినిమా అంటూ ప్రచారం కొనసాగినప్పటికీ కథలో కొత్తదనం, ఫీల్ ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే  ఎంఎస్.రాజు నుంచి ప్రస్తుతం మరో సినిమా రాబోతోంది. కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 7 డేస్ 6నైట్స్ సినిమా రాబోతుంది.అంతేకాదు  ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్ఎస్ రాజు మాట్లాడుతూ.. ఇతను పౌర్ణమి సినిమా తర్వాత మీకు దూరంగా ఉన్నాడు అన్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా ఊహించని విధంగా పరాజయం పాలవడంతో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డర్టీ హరీ అంటూ దర్శకుడిగా అవతారమెత్తాడు ఎంఎస్ రాజు.ఇక  ఆ తర్వాత మధ్యలో ఎంతో మంది హీరోలు ఆయన సంప్రదించి సినిమాలు చేయమని కూడా అడిగారట. ఇదిలావుంటే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా ఒక సినిమా తీయండి అని అడిగగా అందుకు నో చెప్పాను అంటూ తెలిపాడు ఎంఎస్.రాజు.

అంతేకాదు అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు కూడా నో చెప్పానని, వారిద్దరూ వచ్చి అడిగినా కూడా తాను నో చెప్పాను అంటూ సంచలన విషయాలు బయట పెట్టేసాడు రాజు. తనకు కథ నచ్చలేదని, అంతేకాకుండా ఆ సమయంలో సినిమాలు నిర్మించ వద్దు అని ఫిక్స్ అయ్యాను అందుకే నేను నో చెప్పాను అంటూ ఖలేజాసినిమా గురించి బయట పెట్టేసాడు. ఇక అదేవిధంగా అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాకు కూడా నో చెప్పాను అని తెలిపారు.పొతే  ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చినా కూడా సినిమాలు చేయనని తాను అనుకున్న చిత్రాలను మాత్రమే చేస్తాను అని చెప్పుకొచ్చాడు ఎం.ఎస్.రాజు. అయితే ఎం.ఎస్.రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: