టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటూ వచ్చిన గోపీచంద్ పోయిన సంవత్సరం విడుదల అయిన సిటీ మార్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. 

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సిటీ మార్ మూవీ తో గోపీచంద్ మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇలా సిటిమార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ ప్రస్తుతం  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశి కన్నా కథానాయకిగా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ,సాంగ్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్ డేట్ ను విడుదల చేసింది.

పక్కా కమర్షియల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జూన్ 12 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏషియన్ లక్ష్మీ కళ శశికళ సినీ ప్రైడ్, లలితా స్క్రీన్ మూసాపేట్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి ఇప్పటికే సీటి మార్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: