టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల`సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడు.ఇక వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అతడు ఇంకా ఖలేజా చిత్రాలు చేశారు.ఇవి కమర్షియల్‌గా అంత హిట్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను మాత్రం చాలా బాగానే అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ మూవీ ఇక ఆగస్టు నెల నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. సూపర్ స్టార్ మహేశ్‌కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. ఇక `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు.అలాగే ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది.


ఇకపోతే ఈ మూవీకి మహేశ్ బాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు గానూ మహేశ్ ఏకంగా రూ. 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.ఇంతకు ముందు సూపర్ స్టార్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు తీసుకునేవారు అన్న టాక్ ఉంది. కానీ, ఇప్పుడు ఇరవై కోట్లు పెంచి మొత్తం రూ. 70 కోట్లు డిమాండ్ చేశారట. మహేశ్ బాబు సక్సెస్ రేటు దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అనంతరం మహేశ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: