టాలీవుడ్ లో ప్రేమ వివాహాలు చేసుకున్న స్టార్ నటీనటులు చాలామందె ఉన్నారు అలాంటి వారిలో మహేష్,నమ్రత కూడా ఒకరిని చెప్పవచ్చు. బాలీవుడ్ 20 సినిమాలు వరకు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ కి జోడిగా వంశీ చిత్రంలో నటించినది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2005 ఫిబ్రవరి 10వ తేదీన వివాహం చేసుకున్నారు. ఇక అప్పటినుంచి కృష్ణ ఫ్యామిలీకి ప్రతిష్టకి తగినట్టుగానే ఆమె తన బాధ్యతలను చేపడుతూ ఉన్నది. మహేష్ వరద సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నారు.


అందువలన పిల్లల ఆలనా పాలనాను కేవలం నమ్రత నే చూసుకుంటూ ఉన్నది. అలాగే సొంత నిర్మాణ సంస్థకు సంబంధించిన పనులు విషయాలను కూడా ఆమె చాలావరకు చూసుకుంటూ ఉన్నది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇక అంతే కాకుండా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అయితే ఎక్కువగా మహేష్ సోదరి మంజుల తో చాలా చనువుగా ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన నమ్రత కొన్ని విషయాలను తెలిపింది.


మంజుల గురించి నమ్రత మాట్లాడుతూ.. మంజుల నేను ఒక ఫంక్షన్ లో కలిసామని అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది అని అప్పటికి నేను మహేష్ బాబుతో ప్రేమలో ఉన్నారని కానీ ఆ విషయం ఆమెకు తెలియదని.. కానీ ఒకేసారి ప్రెగ్నెన్సీ ధరించడం చాలా యాదృచ్చికమని తెలిపింది వాస్తవానికి పిల్లలు కనడం అనేది అప్పట్లో తనకి ఇష్టం ఉండేది కాదు అని అలాంటి మంజుల ఆ తర్వాత ఒక కూతురుకు జన్మనిచ్చింది అని ఒక తల్లిగా ఆమె ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సమయంలో నేను ఎప్పుడు బాధపడలేదు మహేష్ కంటే నాకు సినిమాలు ఎక్కువ కాదు అనిపించింది అని తెలిపింది. ఇక అంతే కాకుండా మహేష్ కు ఒత్తిడి లేకుండా చూసుకోవడం నా బాధ్యత పిల్లలను చూసుకోవడం నా బాధ్యతగా తీసుకొని అన్నిటిని దగ్గరుండి చూసుకుంటున్నానని తెలిపింది. మీకు తనకి ఎప్పుడు నటించాలని కోరిక కూడా పుట్టలేదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: