యూత్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వర కలిసి నటించిన చిత్రం కార్తికేయ -2 ఇక 2014లో విడుదలై కార్తికేయ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కించడం జరిగింది..మొదటి భాగానికి డైరెక్టర్ చందు మండేటిని రెండో భాగానికి కూడా ఈ డైరెక్టరే తెరకెక్కించారు. చిన్న బడ్జెట్ చిత్రంగా ఆగస్టు 13న ఈ సినిమా విడుదలవ్వగా ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.


ఈ చిత్రం హిందుత్వం శ్రీకృష్ణ సారాంశం వంటి అంశాలు ఉత్తరాది సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపించాయి. మొదటి రోజు హిందీలో 50 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయగా ఆ తర్వాత ఏకంగా 1000 స్క్రీన్ ల పైన ఈ సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాకు అక్కడ ఆదరణ ఎంతగా లభిస్తుందో చెప్పవచ్చు.. ఇక ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా విజయంలో మంచి ఊపు మీద ఉన్న డైరెక్టర్ చందు ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉన్నారు.. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ చందు కు బిగ్ బి అమితాబ్ ను కలిసే అవకాశం కలిగింది.

కార్తికేయ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ అమితాబ్ డైరెక్టర్ ను స్వయంగా పిలిచి అభినందించారట ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ డైరెక్టర్ చందు మురిసిపోయారు. డిగ్రీ ని కలవడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని చాలా ఆనందంతో తెలిపారు ఈ నేపథ్యంలో అమితాబ్ చందు కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. అంతేకాకుండా కార్తికేయ సినిమాలు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. అలాగే ఇందులో శ్రీనివాస్ రెడ్డి, హర్ష తదితరులు కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: