సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ సినిమాలో ఎంతో అల్లరి పిల్లగా నటించిన తేజస్వి ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది.


తర్వాత కేరింత, మనం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేసుకో వంటి ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది. బిగ్ బాస్ లో కూడా పాల్గొనింది.అయితే ఆ సమయంలో తేజస్వి తన ప్రవర్తనతో నెగెటివిటీ మూట కట్టుకుంది.


చాలాకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలో తన ఎక్స్పీరియన్స్ గురించి ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ క్రమంలో తేజస్వి మాట్లాడుతూ..'' బిగ్ బాస్ ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే నాకు దిమ్మతిరిగిపోయిందని కామెంట్స్ చేశారు. సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్‌ మరోక ఎత్తు.


 


కౌశల్‌ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చేశారు. అది డిఫరెంట్ లెవెల్‌ ఆఫ్‌ ఎటాక్‌ అని నేను ఫీల్‌ అయ్యాను. నాపై చెత్త చెత్త గా మీమ్స్ చేసి మరీ నన్ను బ్యాడ్ చేశారు. దాని వల్ల ఒక వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్లొచ్చు. కానీ నేను ఒక ఆడపిల్లను నా దగ్గర ఏం ఉందని నన్ను ఇంత టార్చర్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియాలో లేకుండా బయట దేశాలలో ఒంటరిగా తిరిగాను.


 


ఇంత చేసిన అతను ఇప్పుడు ఎక్కడా లేడు. కానీ చాలా కాలం తర్వాత కమిట్మెంట్ స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే నేను ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నేను అసలు బాగుండను. ముఖం లావెక్కిపోయి, షేప్‌లో లేకుండా ఉంటాను. ఎందుకంటే ఈ సినిమాలో ఫుల్లు తాగేశాను. నా బాధలన్ని అలా తీర్చుకున్నా'' అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తర్వాత గ్లామర్ ఫీల్డ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ కమిట్మెంట్ సినిమా మళ్లీ నన్ను ఈ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది అంటూ ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: