బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబచ్చన్, నాగార్జున కలిసి నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ తో హైటెక్నికల్ విజువల్స్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమానీ స్టార్ స్టూడియో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలలో సెప్టెంబర్ -9 న తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. నాగిని సీరియల్ నటి మౌని రాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నది.


 తాజాగా చిత్రబంధం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇందులో నాగార్జున మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి ఈవెంట్ ఆర్గనైజర్ చేస్తున్నారు అంటే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఈవెంట్ కు వస్తున్నాడు అంటే ఫ్యాన్స్, క్రేజ్ ఎలా ఉంటుందో మనం మనసులో ఊహించుకోవచ్చు అని తెలిపారు. ఇక సెప్టెంబర్ రెండవ తేదీన నా అన్న హరికృష్ణ గారికి పుట్టినరోజు.. ఆయన బిడ్డ నందమూరి తారక రామారావు ఇక్కడికి వచ్చాడు.

నా బిడ్డ ముందు నా అన్నకి తన తరఫునుంచి హ్యాపీ బర్తడే వంటివి చెప్పుకున్నాను అని తెలిపారు. రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమాను సమర్పిస్తున్నారు అంటే ఏదో ఒక సందేహం ఉంటుంది. ఇక డైరెక్టర్ అయాన్ కూడా ఆల్రెడీ కథను చెప్పాడు నాలుగేళ్ల ముందు నుంచే రాజమౌళి గారు ఈ సినిమాలో భాగమయ్యారు. సాధారణంగా నేను రాజమౌళి గారే ఈ సినిమాను మూడు నాలుగేళ్ల పాటు తెరకెక్కిస్తారనుకున్నాను. రాజమౌళి  తీసిన ప్రతి సినిమా కూడా ఏదో శిల్పి చెక్కుతున్నట్లుగా అనిపిస్తుంది
కాబట్టే రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చిందని తెలిపారు. ఈ సినిమా విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అందరిని వండర్ఫుల్ జర్నీలోకి తీసుకువస్తుంది అని తెలిపారు. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా నటించారని తెలిపారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: