టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చి దాదాపు పుష్కర కాలం అయ్యింది.సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలులు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో రాబోతుందని తెలిసి మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహేష్ నటిస్తున్న 28వ ఇది. ఇక ఇప్పుడు మహేష్ కోసం త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేశారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. రెండు నెలల క్రితం లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈసెంట్ గా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు.SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఇటీవల షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ SSMB 28 ఆరంభం అనే టైటిల్ తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కు పార్ధు అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు లో మహేష్ క్యారెక్టర్ పేరు పార్థు. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఉండబోతుందని అంటున్నారు. మరో వైపు అర్జునుడు అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట. పార్ధు అన్న కూడా అర్జునుడు అనే అర్ధం వస్తుంది. అయితే అ అక్షరాన్ని సెంటిమెంట్ గా భావించే త్రివిక్రమ్ అర్జునుడు అనే టైటిల్ కె ఫిక్స్ అయినట్టు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో వాస్తవమెంత వున్నది అనేది. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: