నేషనల్ క్రష్ రష్మిక మందాన భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ లేడీ బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తున్నారు.

పుష్ప మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక మందాన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. అనతి కాలంలో ఎదిగిన ఈ లక్కీ లేడీ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు.

 
పుష్ప 2, యానిమల్, వారసుడు , మిషన్ మజ్ను చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారట.. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ లో అల్లు అర్జున్ తో రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.

 
ఇక విజయ్ కి జంటగా చేస్తున్న వారసుడు 2023 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న వారసుడు చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహర్షి తర్వాత మూడేళ్ల గ్యాప్ రాగా కసితో తెరకెక్కించాడని సమాచారం.

 
ఇక సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో ఆయన భారీ విజయం అందుకున్నాడు. దీంతో రన్బీర్ కపూర్ ఆయనకు ఆఫర్ ఇచ్చాడట.. యానిమల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సమాచారం.

 
రష్మిక ఖాతాలో ఉన్న మరో బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడట.. కాగా రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై ఇటీవల విడుదలైంది. అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం పెద్దగా సందడి చేయలేదు.

 
ప్రొఫెషనల్ లైఫ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా రష్మిక మీద ఎఫైర్ రూమర్స్ ఎక్కువయ్యాయి. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ రూమర్స్ రష్మిక గట్టిగా ఖండించకపోవడం విశేషం. అలా అని ఆమె నేరుగా అయితే ఒప్పుకోవడం లేదు.

 
ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది. ఫ్రెండ్ అంటూ ఇలా ఏకాంత విహారాలు చేస్తుంటే వారి మధ్య ఎఫైర్ నిజమే అని అంటున్నారు. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తెరకెక్కాయి. సిల్వర్ స్క్రీన్ పై ఈ జంట ఓ రేంజ్ రొమాన్స్ అయితే పండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: