బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కత్రినా కైఫ్ స్టార్ డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఫోన్ బూత్ అనే చిత్రంలో నటించిన కత్రినా.. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ని చాలా వేగంగా చేస్తుంది. ఇందులో భాగంగానే కత్రినా కైఫ్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కత్రినా కైఫ్ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి నేర్పించింది ముఖ్యంగా వెంకటేష్ బాలకృష్ణ వంటి వారి చిత్రాలలో నటించి మెప్పించింది.


ఇక మలయాళం లో బలరాం వర్సెస్ తారదాస్ అనే సినిమాలో నటించింది. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు కంటే సౌత్ సినిమాలనే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోని బాలీవుడ్ చెందిన స్టార్ హీరోలంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ పైనే తమ హవా కొనసాగించాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన సల్మాన్ ఖాన్ ఇటీవలే చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించారు. అలాగే అజయ్ దేవగన్ కూడా rrr చిత్రంలో ఒక పాత్ర చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఐశ్వర్యరాయ్ కూడా సమయం దొరికినప్పుడల్లా పలు సౌత్ సినిమాలలో నటిస్తూ ఉన్నది.


ఐశ్వర్యారాయ్ నటించిన పోన్నియన్ సెల్వన్ సినిమా పై ప్రశంసలు వర్షం కురిపించింది కత్రినా కైఫ్ తన జీవితంలో ఇలాంటి అద్భుతమైన చిత్రం ఎప్పుడూ చూడలేదని కితాబ్ ఇచ్చింది. మణిరత్నం సినిమా తీసిన విధానం ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకున్నట్లు ఉందని తెలియజేసింది. ఇక తనకు భాష అనేది పెద్ద సమస్య కాదని మంచి కథ వస్తే సౌత్ దర్శకులతో కూడా సినిమా చేస్తానని తెలియజేసినట్లు సమాచారం. ఇక విక్కీ కౌశల్ తో వివాహం తర్వాత కత్రినా కైఫ్ నటించిన మొదటి చిత్రమే ఫోన్ బూత్. ఈ చిత్రం హర్రర్ కామెడీ జోనర్లు తెరకెక్కించారు డైరెక్టర్ సిద్ధాంత్  చతుర్వేది.

మరింత సమాచారం తెలుసుకోండి: