ఇండస్ట్రీలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలంటే ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు పడుతుంటారు. కొంచెం తేడా కొట్టినా ఇక ఆ డైరెక్టర్,ప్రొడ్యూసర్ పని అయితే ఖతమే.

ఎందుకంటే వారి అభిమాన హీరో విషయంలో అభిమానులు హర్ట్ అయి గొడవలు పడే స్టేజ్ కి కూడా వచ్చేస్తారు. తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్ ని రామ్ చరణ్ పాత్ర కంటే తక్కువగా చేసి చూపించారని,అంతేకాక ఎన్టీఆర్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదని ఎన్టీఆర్ అభిమానులు మూవీ యూనిట్ పై ఆగ్రహం ను వ్యక్తం చేశారు.

డైరెక్టర్ రాజమౌళి పై కూడా చాలా ట్రోల్స్ చేశారు. మరి కొంతమంది అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నెగిటివ్ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ గొడవలు ఇప్పుడేం కాదు.గతంలో నుండి కూడా జరుగుతున్నవే. సూపర్ స్టార్ కృష్ణ,నాగార్జున ఇద్దరు హీరోలుగా వచ్చిన సినిమా వారసుడు. ఈ సినిమాకి మురళీమోహన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా టైం లో జరిగిన ఒక గొడవ గురించి మురళీమోహన్ తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారట . మురళీమోహన్ మాట్లాడుతూ.. వారసుడు సినిమాలో ఒక సన్నివేశంలో నాగార్జున కృష్ణ ని నువ్వెంత అంటూ గొడవ పడడం కూడా జరుగుతుంది.

ఆ సన్నివేశంలో కృష్ణ ను పట్టుకొని నాగార్జున వాదిస్తూ మాట్లాడతారట.. అయితే ఈ సీన్ కారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ ఫ్యాన్స్ అందరూ నాగ్ తో గొడవ పడ్డారు. కానీ ఈ సినిమాలో ఉన్న పాత్ర నచ్చడంతో కృష్ణ గారు ఈ సినిమాలో నటిస్తానని చెప్పారు. అంతేకాదు కృష్ణ మంచి మనసున్న గొప్ప హీరో. ఒకవేళ ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లని ఆదుకునే విషయంలో కృష్ణ గారు అందరికంటే ముందుంటారట.. ఇక ఈ సినిమా విషయంలో అప్పట్లో చాలా మంది కృష్ణ గారి అభిమానులు నాగార్జున ను కొడదాం అనే స్టేజ్ కి వచ్చారని మురళి మోహన్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారట

మరింత సమాచారం తెలుసుకోండి: