ఛలో సినిమాతో దర్శకుడుగా పరిచయమై భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు
వెంకీ కుడుముల. రెండవ సినిమాతో కూడా ఘనవిజయం సాధించి ద్వితీయ విఘ్నన్ని దాటాడు. నితిన్ హీరోగా ఆయన చేసిన భీష్మ చిత్రం తో ఈ దర్శకుడు
సినిమా చేయడానికి పెద్ద పెద్ద హీరోలు క్యూ లు కట్టారు. ఆ విధంగా ఆయన
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో అందరి హీరోలను కాదని చిరంజీవితో
సినిమా చేయడానికి ముందుకు వెళ్లాడు. దానికి తగ్గట్లుగానే ఆయన రూపొందించిన కథతో
మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి సినిమాను కూడా ఓకే చేసుకున్నాడు
కానీ తన ఫుల్ స్క్రిప్ట్ తో
మెగాస్టార్ చిరంజీవిని మెప్పించలేకపోయిన
వెంకీ కుడుముల ఫైనల్ గా ఆ చిత్రాన్ని జారవిడుచుకున్నాడు అని చెప్పాలి. కథ బాగా రాయలేకపోయినా దర్శకుడైన
వెంకీ కుడుముల ఇప్పుడు అదే కథను మరొక హీరోతో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోగా పేరు ఉన్న బాలకృష్ణతో ఈ కథను
సినిమా గా చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే ఆయనతో కథను కూడా చెప్పి దాదాపుగా దానికి ఓకే చెప్పించాడు అని అంటున్నారు.
అయితే
బాలకృష్ణ చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో ఆయన చిత్రాన్ని చేయాలి అంటే తప్పకుండా
వెంకీ కుడుముల మరొక ఏడాది అయిన ఆగాల్సిందే అని చెబుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలయ్య. వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ
సినిమా విడుదల చేస్తూ ఉండగా ఈ
సినిమా యొక్క మరొక సినిమాను మొదలుపెట్టబోతున్నాడు నందమూరి బాలకృష్ణ.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ
సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాకి ఎంత లేదన్నా చాలా రోజుల సమయం పడుతుంది. వచ్చే ఏడాది మొత్తం ఆ
సినిమా షూటింగ్ పడుతుంది కాబట్టి
వెంకీ కుడుములతో
సినిమా చేయాలి అంటే నందమూరి
బాలకృష్ణ మరొక ఏడాది అయినా వేచి చూడవలసిందే. ఇప్పటికే చిరంజీవితో చాలా సమయాన్ని వెచ్చించిన ఈ దర్శకుడు
బాలకృష్ణ కోసం ఈ సమయాన్ని ఖర్చు పెడతాడు అనేది చూడాలి.