జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస విజయాల నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యమైనా పరవాలేదని తర్వత సినిమాతో కూడా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని తారక్ అనుకుంటున్నారట  .తారక్ కు సోదరుడు కళ్యాణ్ రామ్ అంటే ఎంతో ప్రేమ కాగా కళ్యాణ్ రామ్ తన సినిమాలలో మెజారిటీ సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించాడు. అయితే కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఆర్థికంగా నష్టం కలిగించాయి. అయితే సోదరుడిని ఆదుకోవాలనే ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కిన జై లవకుశ సినిమాను నిర్మించే అవకాశాన్ని కళ్యాణ్ రామ్ కు ఇచ్చారట . ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు మంచి లాభాలను అందించడం విశేషం.

అయితే కళ్యాణ్ రామ్ కు మరింత బెనిఫిట్ కలిగించాలనే ఆలోచనతో తారక్ తన తర్వాత సినిమాలలో కూడా కళ్యాణ్ రామ్ కు భాగస్వామ్యం ఇచ్చారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ, తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ కు భారీగా లాభాలు వచ్చి తారక్ త్యాగాల కు తగ్గ ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాలలో రెమ్యునరేషన్ లేకుండా నటించి కళ్యాణ్ రామ్ కు బెనిఫిట్ కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ హీరో గా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బింబిసార సినిమా సక్సెస్ తో కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: