డిఫరెంట్ హీరో సత్యదేవ్‌ ల్లో ఓ ప్రత్యేకత ఘనత ఉంటుంది. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు సైడ్ క్యారెక్టర్ గా దూసుకుపోతున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ నటుడు.

ఇటీవల మెగాస్టార్ తో కలిసి 'గాడ్ ఫాదర్'లో నటించి  అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి 'రామ్ సేతు'లో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అంటా మరీ, సత్య దేవ్ , కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.

నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వెటరన్ యాక్టర్ సత్యరాజ్సినిమా లో కీలకమైన పాత్రలో నటించనున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతుంది అని టాక్. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు,. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ఇటీవల నిర్మాతలు ప్రకటించారు.

చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి టోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఈ సినిమా కి ఎడిటర్ గా పని చేస్తున్నారు. సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ పై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో చిత్ర యూనిట్ వర్గం ప్రకటించనున్నారు అంటా .

మరింత సమాచారం తెలుసుకోండి: