డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గడిచిన కొద్దిరోజుల క్రితం పూర్తి అయ్యాయి. పుష్ప చిత్రం రూ.400 కోట్ల రూపాయలు కలెక్షన్ల సాధించింది పుష్ప 2 చిత్రం కూడా ఇంతకంటే ఎక్కువ కలెక్షన్లను సాధించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో పలు పాత్రలలో పలువురు నటీనటులను సైతం నటింపజేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.


తాజాగా ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతుంది ఈ సినిమాలో అనసూయ నెగటివ్ షెడ్లో కనిపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంగళం శ్రీను భార్య పాత్రలో అనసూయ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా లేడీ విలన్ ను క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఆ పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా గతం లో నటించిన సరైనోడు సినిమా లో ఈమె హీరోయిన్ గా నటించింది.

మొత్తానికి పుష్ప 2 సినిమా విషయంలో పలు రకాల ప్రచారణలు అయితే జరుగుతున్నాయి.. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుపడలేదు.ఈ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కూడా పుష్ప 2 సినిమా అప్డేట్ తెలియజేయాలి అంటే ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మరి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా సుకుమార్ పుష్ప 2 చిత్రంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: