కామెడీ సినిమాలకు చిరునామాగా ఒక వెలుగు వెలిగిన అల్లరి నరేష్ తన కామెడీ ట్రాక్ కు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడంతో రూట్ మార్చి సీరియస్ కథల వైపు వస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ టాక్ బయటకు రాకుండానే అక్కినేని నాగార్జున అల్లరి నరేష్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


గత కొంతకాలంగా నాగార్జున సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారుతూ ఉండటంతో నాగ్ ఎలాంటి కథలను చేయాలి అన్న టెన్షన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన ఒక కథకు నాగ్ ఓకె చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అది ఒరిజనల్ స్టోరీ కాదు ఒక రీమేక్ అని అంటున్నారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం 2019లో వచ్చిన మళయాళం సూపర్ హిట్ ‘పోరింజు మరియం జోస్’ కు రీమేక్ గా నాగార్జున కొత్త సినిమా ఉంటుందని అంటున్నారు.


ముగ్గురు స్నేహితుల మధ్య ముగ్గురు స్నేహితుల మధ్య సాగే యాక్షన్ కం ఎమోషనల్ థ్రిల్లర్ మూవీగా ఈమూవీని తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలోని ముగ్గురు మిత్రులలో ఒక హీరోయిన్ పాత్ర కూడ ఉండటంతో ఆ పాత్రలో నటించే ఒక టాప్ హీరోయిన్ గురించి అన్వేషణ్ సాగుతున్నట్లు టాక్. ఈమూవీ కథ 1965లో మొదలై 1985కు వస్తుంది.


ఇలాంటి వెరైటీ కథలో నాగార్జున స్నేహితుడుగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ ‘మహర్షి’ మూవీలో హీరోకి ప్రాణ స్నేహితుడుగా నరేష్ నటించి మెప్పించాడు. అయితే ఆతరువాత నరేష్ కు చెప్పుకో తగ్గ అవకాశాలు రాలేదు. అవకాశాలు వచ్చినా హీరోకి అన్న చిన్నాన్న పాత్రలు వస్తే వాటిని నరేష్ రిజక్ట్ చేసాడు అని అంటారు. ఇప్పుడు నాగార్జున పక్కన్న స్నేహితుడుగా నరేష్ నటిస్తున్న పరిస్థితులలో ఈసారి అయినా అతడికి అతని సమర్థతకు తగ్గ అవకాశాలు వస్తాయేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: