ఏ సినీ పరిశ్రమలో అయినా సరే హీరో లేదా డైరెక్టర్ తమ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే తమ తదుపరిచిత్రాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకసారి డిజాస్టర్ కొట్టారు అంటే వారిని మళ్లీ పట్టించుకునే వారే ఉండరు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బద్రి సినిమాతో డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన ఆ తర్వాత పోకిరి, ఇడియట్ వంటి చిత్రాలతో పాటు మరెన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో వరుస డిజాస్టర్లు రావడంతో ఇండస్ట్రీకి దూరమైన పూరీజగన్నాథ్ మళ్లీ రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరొకసారి తనలో ఉన్న స్ట్రాటజీని చూపించారు.

కానీ ఇటీవల మళ్ళీ ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా లైగర్ మాత్రం డిజాస్టర్ అవడంతో పూరి జగన్నాథ్ పై నమ్మకం కూడా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడమే కాకుండా డిస్టర్బ్యూటర్లకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా వివాదం ఇంకా తగ్గలేదని చెప్పాలి. క్రమంలోనే ఆయన విజయ్ దేవరకొండ తో కలిసి జనగణమన సినిమా చేయాల్సి ఉండగా లైగర్ సినిమా ఎఫెక్ట్తో మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా రావడం కష్టమేనని కూడా స్పష్టం అవుతుంది.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లైగర్ సినిమా ఎఫెక్ట్ ఇతర హీరోల కెరియర్ పై పడుతుందనే ఆలోచనలో వారు ఆయనకు అవకాశాలు ఇవ్వలేదని సమాచారం. యంగ్ హీరోలు కూడా పూరీ జగన్నాథ్ కథలకు నో చెబుతున్నారట.. ఈ క్రమంలోనే ఆయన తమిళ్ యంగ్ హీరోతో సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే కథ వినిపించగా అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.  మరి ఈ సినిమాతో పూరీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: