ప్రముఖ ఓటీటీ తెలుగు ప్లాట్ ఫామ్ అయినా ఆహా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్లాన్ చేస్తూ విపరీతంగా సబ్ స్క్రైబర్ లను పెంచుకుంటుంది. ఈ క్రమంలోని యువతను కట్టిపడేసే విధంగా బుల్లితెర ఇండస్ట్రీపై ఎప్పుడు అడుగుపెట్టని నటసింహ బాలకృష్ణను అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో ద్వారా హోస్ట్ గా వ్యవహరించేలా చేశారు. మొదట బాలయ్య బాబు కూడా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తనలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి ఇలాంటి షోలు బాలయ్య తప్ప మరెవరూ చేయలేరు అని నిరూపించారు.

ఈ క్రమంలోనే మొదటి సీజన్ పూర్తయ్యేసరికి భారతదేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకుంది ఈ షో.. ఆ తర్వాత రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు.  ఇందులో కొంచెం రాజకీయ అంశాలను కూడా జోడిస్తూ మరింతగా షోని ముందుకు తీసుకెళుతున్నారు నిర్వాహకులు. ఇకపోతే ఇప్పటివరకు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని ప్రభాస్ .. బుల్లితెరపై కనిపించడానికి మొహమాటపడే ఆయన ఎట్టకేలకు ఆహా నిర్వాహకుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ షో కి తన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు.


ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు , గ్లింప్స్ అన్నీ కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఎపిసోడ్ ముందుగా థియేటర్లలో విడుదల చేయాలి అని ప్రభాస్ అభిమానులు ఆహా ను  అభ్యర్థిస్తున్నారు.  అంతేకాదు అభిమానుల కోరిక మేరకు ఆహా కూడా ట్విట్టర్ లో  ఓటింగ్ పోల్ నిర్వహించనుంది.. అభిమానుల అభిప్రాయాన్ని కోరడానికి ఇలాంటి పోలింగ్ నిర్వహించింది.  ఒకవేళ అభిమానులు థియేటర్లలోనే ఈ ఎపిసోడ్ రిలీజ్ చేయాలని భావిస్తే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా ఆహా స్పష్టం చేసింది. ఈ ఎపిసోడ్ కోసం అటు టెలివిజన్ వర్గాలే కాదు ఇటు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.  అందుకే ఇది థియేటర్లలో రిలీజ్ అయితే భారీ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: