ఈ సినిమా తర్వాత కొద్ది రోజుల ముందు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ డ్రామా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న వినోదయ సీతమ్ సినిమా వెనక్కి వెళ్లిందని అందరూ భావించారు కానీ కొత్త ఏడాదిలో పవన్ ఈ సినిమా కోసం డేట్ కేటాయించారని తెలుస్తోంది. సాయి ధరంతేజ్ కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాను రీమేక్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు.
అయితే ఎటువంటి అంచనాలు, ఆడంబరాలు లేకుండా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుందని సమాచారం. ఇకపోతే జనవరి 16వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. కేవలం 20 రోజులు మాత్రమే ఆయన ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.