నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించి అద్భుతమైన నటుడి గా కూడా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగులో ఎస్ జె సూర్య , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిన ఖుషి మరియు కొమరం పులి మూవీ లకు దర్శకత్వం వహించగా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన నాని మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఎస్ జె సూర్య సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య , రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్ జై సూర్య "వదంతి" అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా ఇప్పటికే సక్సెస్ అయిన ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు , మరి కొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడునున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: