టాలీవుడ్ అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరనే విషయం తెలిసిందే. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా మహేష్ బాబు మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు మహేష్ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నపిల్లల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులను నింపాడు. ఇప్పటివరకు కొన్ని వందల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఆయన మంచి మనసు పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 ఇదిలా ఉంటే తాజాగా ఈ నూతన సంవత్సరం నుంచి తన సేవలను మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా మరో మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు మహేష్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన గారాల కూతురు సితార ఈ విషయం గురించి ప్రకటన చేయడమే కాకుండా తన వంతుగా తాను ఏం చేయబోతుందో కూడా వివరిస్తూ తాజాగా ఓ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వీడియోలో సితార అందించిన వివరాలు ఏమిటంటే.." తన సేవా కార్యక్రమాల కోసం ఓ ప్రత్యేకమైన వెబ్సైట్ని ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొంది సితార. 

అంతేకాదు ఈ వెబ్సైట్ గురించి తాను ప్రకటించడమే కాకుండా తన వంతుగా పాకెట్ మనీని డొనేట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇక ఈ వీడియోలో సితార మాట్లాడుతూ ...ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్సైట్ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఫౌండేషన్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ పేర్కొంది సితార. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సితార పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం జరిగింది. ఇక అక్కడే మహేష్ ఫ్యామిలీ అంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్  దర్శకత్వంలో  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: